Gossipsపద్మావతి సినిమాకు వార్నింగ్ ఇచ్చిన నేత..!

పద్మావతి సినిమాకు వార్నింగ్ ఇచ్చిన నేత..!

బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు సంజయ్ లీలా భన్సాలీ.  ప్రస్తుతం దీపికా పదుకొనె లీడ్ రోల్ లో పద్మావతి లాంటి ఓ చారిత్రాత్మక సినిమాతో మరోసారి అభిమానుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి నీలినీడలు కమ్ముతూ వస్తున్నాయి.  తాజాగా హైదరాబాద్‌ గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ నేత రాజా సింగ్ లోథా పద్మావతి చిత్ర నిర్మాతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాణి పద్మిణితో అల్లా ఉద్దీన్ ఖిల్జీ ప్రేమాయణం సాగించినట్లుగా చూపించినట్టు తెలుస్తోంది. కానీ వాస్తవానికి చరిత్రలో అలా జ‌రగ‌లేదు. అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోర్‌గఢ్‌పై దాడి చేసిన అనంతరం 16 వేల మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారని రాజ్‌పుత్ కమ్యూనిటీ ప్రజలకి చరిత్రను గుర్తుచేశారు రాజా సింగ్ లోథా. ప్రతి ఒక్క హిందువు ఇందుకోసం పోరాటం చేయాలి.  ఈ పోరాటంలో పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్లని బయటకు తీసుకొచ్చే బాధ్యత తనదేనని వారికి హామీ ఇచ్చారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news