Gossips'ఉన్నది ఒకటే జిందగీ' సెన్సార్ టాక్..!

‘ఉన్నది ఒకటే జిందగీ’ సెన్సార్ టాక్..!

దేవదాసు సినిమా నుండి తన ఎనర్జిటిక్ హీరోయిజంతో ప్రేక్షకులను అలరిస్తున్న రామ్ లాస్ట్ ఇయర్ నేను శైలజ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసాడు.  తాజాగా ఈ హీరో నటించిన ఉన్నది ఒకటే జిందగీ అనే వెరైటీ లవ్ స్టోరీతో ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ప్రేమ, స్నేహానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారో కనిపిస్తుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సినిమాకు U సర్టిఫికెట్ కేటాయించింది.

రామ్ సరసన లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు.  రామ్ హోమ్ ప్రొడక్షన్స్ అయిన స్రవంతి రవికిషోర్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.  శ్రీ విష్ణు, పెళ్లిచూపులు ఫేమ్ ప్రియదర్శి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రామ్ నటించిన   ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ కాబోతుంది.

సినిమా ట్రైలర్ లో చూపించినట్టుగా డైలాగ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది. ఇక స్నేహానికి ప్రేమకు కూడా సినిమాలో మంచి ఫీల్ గుడ్ సీన్స్ ఉన్నాయట. మొత్తానికి నేను శైలజ సినిమాతో హిట్ అందుకున్న కిశోర్, రాం కాంబో ఉన్నది ఒకటే జిందగితో ఆ హిట్ మేనియా కంటిన్యూ చేయాలని చూస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news