Gossipsస్టేజ్ షో లో హరితేజ పై ప్రేక్షకులు ఫైర్

స్టేజ్ షో లో హరితేజ పై ప్రేక్షకులు ఫైర్

అప్పటివరకు సాదా సీదా సైడ్ రోల్స్ వేస్తున్న హరి తేజకు అదృష్టం బిగ్ బాస్ రూపం లో వచ్చింది . కేవలం అదృష్టం ఉంటే సరిపోదని దానికి తగ్గ టాలెంట్ కూడా ఉండాలని బిగ్ బాస్ లో హరితేజ ప్రూవ్ చేసింది . ఆమె చాలా ఎపిసోడ్స్ ఒంటి చేత్తో నడిపిందనే చెప్పాలి . ఇప్పుడు షో ముగిసింది . హరి తేజకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఇటు బిగ్ స్క్రీన్ అటు స్మాల్ స్క్రీన్ అని తేడా లేకుండా హరి తేజకు తెగ ఛాన్సులు వచ్చేస్తున్నాయి. జెమిని TV లో ఫిదా ప్రోగ్రాంకి హరితేజ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే . ఆ షో కి మంచి ఆదరణే లభిస్తుంది .

అయితే మొన్న దీపావళి సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి లో నిర్వహించిన ఒక ప్రోగ్రాంకి మిమిక్రి ఆర్టిస్ట్ శివ రెడ్డి తో పాటు హరితేజ కూడా యాంకరింగ్ చేసింది. ఒకరి పై ఒకరు పోటీపడుతూ ఆ ప్రోగ్రాం చేశారు. ఒకరి పై ఒకరు పంచ్ లు కూడా వేసుకున్నారు . అయితే ప్రభుత్వ కార్యక్రమం లో స్టేజ్ పై వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ప్రేక్షకులకు రుచించలేదనే చెప్పాలి . వీరిద్దరి యాంకరింగ్ హాస్యాన్ని పంచినప్పటికీ.. స్టేజ్ మీద హరితేజ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. సెటైర్లు వేసుకోవడం కాస్త శ్రుతి మించిందంటున్నారు. హరితేజ లాంటి టాలెంటెడ్ పర్సన్ ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

హరితేజ కు ఇంతకుమించి గుడ్ టైం ఉండదు. ఇలాంటి సమయం లో ప్రేక్షకులలో నెగెటివ్ ఇంప్రెషన్స్ క్రియేట్ కాకుండా చూసుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news