Gossipsమార్షల్ ఆర్ట్స్ లో ఎన్టీఆర్ కి ట్రైనింగ్.. ఎందుకు..?

మార్షల్ ఆర్ట్స్ లో ఎన్టీఆర్ కి ట్రైనింగ్.. ఎందుకు..?

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవ కుశ. ఈ సినిమాకు సంబందించిన కొన్ని పోస్టర్స్ ఈరోజు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ లుక్ టీజర్ పోస్టర్స్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి.

ఇక సినిమా నుండి ఈరోజు రిలీజ్ అయిన పోస్టర్స్ లో మూడు పాత్రలు చేస్తున్న తారక్ స్టిల్స్ వచ్చింది. ఆ పోస్టర్ చూసి ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపయ్యిందని చెప్పొచ్చు. బాక్సాఫీస్ భరతం పట్టేందుకు ఒకటి రెండు కాదు ఏకంగా మూడు పాత్రలతో ఎన్.టి.ఆర్ నట విశ్వరూపం జై లవ కుశలో చూడబోతున్నాం.

సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 10న ఉండబోతుంది. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news