Newsమరో వివాదంతో వార్తల్లోకెక్కిన నటి శ్రీవాణి.. ఈసారి ఏం చేసిందో తెలుసా?

మరో వివాదంతో వార్తల్లోకెక్కిన నటి శ్రీవాణి.. ఈసారి ఏం చేసిందో తెలుసా?

Actress Srivani came on news another time with new controversy. This time senior actress Kavitha complaints against her for not paying money according to agreement for Kevvu Kabaddi show. Read below article to know more details.

గతంలో తన వదినతో గొడవపడి పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కిన నటి శ్రీవాణి గుర్తుందా..? అప్పట్లో ఆమె వ్యవహారం పెద్ద దుమారమే రేపిందిలెండి. ఇల్లు, భూవాటా కోసం అప్పట్లో వదినతో గొడవపడ్డ ఆ అమ్మడు.. ఆ కేసులో పోలీస్ విచారణకు సైతం డుమ్మాకొట్టి మీడియాలో హల్‌చల్ చేసింది. ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది. ఇంకా దాని వేడి చల్లారకముందే.. ఈ భామ మరో వివాదంతో వార్తల్లోకెక్కింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీవాణి భర్త విక్రమాదిత్య కెవ్వు కబాడీ అనే షోని నిర్వహిస్తున్నారు. 60 మందికిపైగా బుల్లితెర నటీనటులు పాల్గొంటున్న ఈ షోకి న్యాయనిర్ణేతగా సీనియర్ నటి కవితని ఎంపిక చేశారు. ఇందుకుగాను శ్రీవాణి దంపతులు ఆమెతో రోజుకు 25 వేలు చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ విషయంలోనే శ్రీవాణి, కవిత మధ్య విభేదాలు తలెత్తాయి. అగ్రిమెంట్ ప్రకారం.. తనకు డబ్బులు ఇవ్వకపోగా.. శ్రీవాణి తనని అసభ్యకరంగా దూషించిందంటూ కవిత ఫిర్యాదు చేశారు.

కబాడీ షోకి తనకి డబ్బులు చెల్లించలేదని, కేవలం 7 రోజులకుగాను 75 వేలు మాత్రమే క్యాష్ ఇచ్చారని, మిగిలిన డబ్బులు అడిగితే వారి నుండి సరైన స్పందన లేదని నటి కవిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. తనని దూషించారని కూడా తెలిపింది. తన మొత్తం తనకు ఇప్పించాలని ఆమె కోరుతోంది. అయితే.. శ్రీవాణి మాత్రం కవిత వ్యాఖ్యల్ని ఖండిస్తోంది. ఆమెకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెక్ రూపంలో ఇచ్చేశామని ఆమె వాదిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news