Newsఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ ఎన్ని భారీ రికార్డులు సాధించిందో...

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ ఎన్ని భారీ రికార్డులు సాధించిందో తెలుసా..?

Indian cricket team has created new world records in the recent test series with England. Read below articles to know more details.

ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 4-0 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకోవడమే కాదు.. ఎన్నో భారీ రికార్డులు సొంతం చేసుకుంది. భారతీయ ఆటగాళ్లు తమ అద్భుతమైన ఆటతో తమ పేరిట ఎన్నో ఘనతలు సాధించారు. అ వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి…

– ఒకే సంవత్సరం మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన మొదటి టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి రికార్డు సృష్టించాడు. అలాగే.. ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన మొత్తం పరుగులు 655. ఒక టెస్టు సిరీస్‌లో 600కుపైగా పరుగులు చేయడం కోహ్లికి ఇది రెండోసారి. సునీల్‌ గవస్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత ఈ ఘనత సాధించి.. కోహ్లీ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. దీంతోపాటు.. టెస్టుల్లో 4000వేల పరుగుల మైలురాయిని దాటిన 14వ భారత బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లి నిలిచాడు.

– చెన్నై టెస్టులో కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీ కొట్టడం ద్వారా.. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. మొదటి స్థానంలో విరేందర్ సెహ్వాగ్ రెండు త్రిపుల్ సెంచరీలతో మొదటిస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.

– ఈ సిరీస్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ 306 పరుగులు చేయడంతోపాటు 28 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఓ సిరీస్‌లో 25కి పైగా వికెట్లు, 250కిపైగా పరుగులు చేయడం ద్వారా.. ఈ ఘనత సాధించిన రెండో భారత ఆల్‌రౌండర్‌గా రికార్డ్ సాధించాడు.

– వందేళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇద్దరు ఆటగాళ్లు 20కిపైగా వికెట్లు పడగొట్టడం, రెండు లేదా అంతకుమించి 50 పరుగులు సాధించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనతని క్రికెటర్లుగా అశ్విన్‌, రవీంద్ర జడేజా సాధించారు.

– 140 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 55 బంతుల్లో 51 పరుగులు చేసి, పది వికెట్లు తీసుకొని, నాలుగు క్యాచ్‌లు అందుకున్నతొలి క్రికెటర్‌గా జడేజా అద్భుతమైన రికార్డు సాధించాడు.

– 2008 తర్వాత ఇంగ్లండ్‌పై భారత్‌ సాధించిన తొలి టెస్టు సిరీస్‌ విజయం కూడా ఇదే. ఆ తర్వాత జరిగిన మూడు టెస్టు సిరీస్‌లలోనూ భారత్‌ ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైంది.

– టెస్టుల్లో భారత్ తొలిసారి అత్యధిక స్కోరు (759/7)ను సాధించింది. చెన్నైలో ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సొంతం చేసుకుంది.

– టెస్టు క్రికెట్‌లో మూడువేల పరుగులు మైలురాయిని దాటిన 20వ క్రికెటర్‌గా చటేశ్వర్‌ పూజారా, 21వ క్రికెటర్‌గా మురళీవిజయ్‌ నిలిచారు.

– ఇంగ్లండ్‌ జట్టుపై భారత్‌కు ఇదే అతిపెద్ద సిరీస్‌ విజయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news