Moviesపవన్‌తో డబ్బుల గొడవపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్

పవన్‌తో డబ్బుల గొడవపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్

Finally, after a long time producer BVSN prasad responds on Pawan Kalyan’s complaint in producers council for Attarintiki Daredi remuneration before Nannaku Prematho release.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ విడుదలకు రెడీ అవుతున్న తరుణంలో ఆ మూవీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌పై బాకీపడ్డ డబ్బుల విషయమై పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘అత్తారింటికి దారేది’ సినిమాకి సంబంధించి తనకు పారితోషికంలో భాగంగా ఇంకా రెండుకోట్లు ఇవ్వాల్సి ఉందని తన ఫిర్యాదులో పవన్ పేర్కొన్నాడు. పవన్‌తోపాటు త్రివిక్రమ్ కూడా ఫిర్యాదు చేశాడులెండి. ‘నాన్నకు ప్రేమతో’ రిలీజ్‌కి సరిగ్గా రెండురోజుల ముందు ఇలా కంప్లైంట్ చేయడంతో అప్పట్లో అది తీవ్ర సంచలనం రేపింది.

ఆ ఇద్దరు అలా ఫిర్యాదు చేశారో లేదో నిర్మాత వెంటనే వారితో మంతనాలు జరపడం, డబ్బుల విషయమై చర్చలు జరపడం, వివాదం సద్దుమణగడం.. అంతా చకచకా జరిగిపోయింది. అంతేగానీ.. దానిపై పవన్‌గానీ, త్రివిక్రమ్‌గానీ, నిర్మాత ప్రసాద్‌గానీ ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత నిర్మాత ప్రసాద్ ఆ గొడవ గురించి స్పందించాడు. తన నిర్మాణంలో తెరకెక్కిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన.. ఆ డబ్బుల గొడవకు సంబంధించి పవన్ తప్పేమీ లేదని అన్నాడు. పవన్ తనను ఉద్దేశపూర్వకంగా ఏమీ ఇబ్బంది పెట్టలేదని, తానే ఇబ్బందికి గురయ్యానని చెప్పుకొచ్చాడు.

‘అత్తారింటికి దారేది సినిమాకిగాను నేను పవన్‌కి కొంత అమౌంట్ ఇవ్వాలి. అది కాస్త ఆలస్యమైంది. అయినా అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు. పవన్ నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. నేనే ఇబ్బంది పడ్డాను.. అంతే. అది ఎందుకు జరిగిందో కానీ జరిగిపోయింది. ఆ సమయంలో అలాంటి పరిస్ధితిలో నేనుండడం నా దురదృష్టంగా భావిస్తున్నా. పవన్ ఫిర్యాదు వల్ల ‘నాన్నకు ప్రేమతో’ రిలీజ్ సమయంలో ఏమైనా ఇబ్బంది పడ్డానా అంటే.. అలాంటివి జరుగుతుంటాయి.. జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్లాలి’ అని తెలుసుకున్నాను అని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ వివరించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news