Newsఆ విషయంలో చిరు అట్టర్ ప్లాప్... బాలయ్య సూపర్ హిట్ !

ఆ విషయంలో చిరు అట్టర్ ప్లాప్… బాలయ్య సూపర్ హిట్ !

Tollywood is eagerly waiting to see who is going to won in the box-office race between two legends of telugu cinema Chiranjeevi and Balakrishna. This result will come on Sakranti. But before this, in one case Balayya has dominates Chiru. Read the full story to know more details.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లెజెండ్స్ చిరంజీవి, బాలయ్యలు తమతమ సినిమాల్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. చాలాకాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో.. ఈ ఇద్దరి హీరోల్లో ఎవరు గెలుస్తారా? అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారన్నది పక్కనపెడితే.. ఓ విషయంలో మాత్రం చిరుపై బాలయ్యనే పైచేయి సాధించారు. అదే.. ప్రమోషన్ కార్యక్రమాల్లో!

బాలయ్య తన ప్రతిష్టాత్మక వందోచిత్రాన్ని మొదటినుంచి విస్తృత స్థాయిలో ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ప్రారంభోత్సవాన్నే ఓ ఉత్సవంలా నిర్వహించారు. సీఎం కేసీఆర్, చిరంజీవి, వెంకటేష్, ఇంకా మరెందరో అతిరథ మహారథుల్ని పిలిపించి.. ఆ ఈవెంట్‌ని ఘనంగా జరిపించారు. ఆ తర్వాత సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి మూవీ యూనిట్ షూటింగ్‌కి సంబంధించి అప్‌డేట్స్ ఇస్తూ వస్తోంది. సరైన సమయం చూసుకుని ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్‌ని రిలీజ్ చేసింది. మధ్యలో ఏవైనా ఈవెంట్స్ వచ్చిన ప్రతిసారీ.. కొత్తకొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ మూవీపై అంచనాలు పెంచుతోంది. అంతేకాదు.. ఆన్‌లొకేషన్ స్టిల్స్ రిలీజ్ చేస్తూ వస్తోంది. రీసెంట్‌గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రటీం.. ప్రపంచవ్యాప్తంగా 100 థియేటర్లలో ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఆడియో వేడుకని చరిత్రలో నిలిచిపోయేలా భారీగా ప్లాన్ చేస్తోంది. తదనంతరం.. రిలీజ్ అయ్యేవరకు ఇంటర్వ్యూలు, ఇతర మార్గాల ద్వారా చిత్రాన్ని ప్రమోట్ చేసేలా పక్కా స్కెచ్ గీసుకుంది.

ఇక చిరు సినిమా విషయానికొస్తే.. మొదటినుంచి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకుండా సైలెంట్‌గా పనికానిచ్చేస్తున్నారు. ప్రారంభోత్సవాన్ని హడావుడి లేకుండానే కానిచ్చారు. సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి అప్‌డేట్స్ ఇవ్వలేదు. ఆమధ్య 60 శాతం షూటింగ్ పూర్తయ్యిందని చరణ్ చెప్పాడే తప్ప.. ఆ తర్వాత మరేం వెల్లడించలేదు. దీపావళి కానుకగా ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. అంతే.. మరో పోస్టర్‌గానీ, టీజర్‌గానీ విడుదల చేయలేదు. షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇంకా ఈ మూవీ షూటింగ్ పూర్తవ్వలేదు. ఇలాంటి టైంలో చిరు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో షూటింగ్‌లో, చరణ్ తన లేటెస్ట్ మూవీ ‘ధృవ’ రిలీజ్ హడావుడిలో బిజీ అయిపోయారు. ఓవరాల్‌గా చెప్పుకుంటే.. ప్రమోషన్ కార్యక్రమాల్లో ఖైదీ పూర్. ఈ లెక్కన.. బాలయ్యే గెలిచారన్నమాట. మరి.. బాక్సాఫీస్ పోరులో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news