Newsజయలలిత-శోభన్‌బాబు కూతురు అని చెప్పబడుతున్న ఆ మహిళ ఎవరో తెలుసా..? ఆమె...

జయలలిత-శోభన్‌బాబు కూతురు అని చెప్పబడుతున్న ఆ మహిళ ఎవరో తెలుసా..? ఆమె ప్రస్తుత పరిస్థితి చూడండి..

Finally, Chinamayi Sripada smashes the rumours on a woman who’s photo going viral by noting that she is daughter of Jayalalitha and Shobhan Babu.

తమిళనాడు సీఎం జయలలిత మరణించిన తర్వాత ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ వస్తోంది. ఆ ఫోటోలో ఉన్న మహిళ జయ-శోభన్‌బాబులకు పుట్టిందనే రూమర్ కూడా ప్రచారం జరుగుతోంది. తొలుత ఈ వార్తని ఎవరూ పట్టించుకోలేదు కానీ.. రానురాను వైరల్ అవుతుండడంతో అందరూ నిజమనే భావనని వచ్చారు. పైగా.. మీడియా, వెబ్‌సైట్లు సైతం తండోపతండాలుగా వార్తలు రాస్తుండడం.. వాట్సాప్‌లో షేర్ చేస్తుండడంతో.. ఆమె వారిద్దరి పుట్టిన బిడ్డేనని అనుకున్నారు. కానీ.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ అయిన శ్రీపాద చిన్మయి ఆధారాలతో సహా స్పష్టం చేశారు. ఆ మహిళ వివరాల్ని కూడా ఆమె సోషల్ మీడియాలో వివరించారు.

ఆ మహిళ ‘మృదంగం విద్వాన్’ వి.బాలాజీ కుటుంబానికి చెందిందని చిన్మయి తన అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకి ఎలాంటి కాన్సర్ట్స్ లేకపోవడం వల్లే.. ‘హస్‌బ్యాండ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారని ఆమె పేర్కొంది. ఆ ఫోటోలో ఉన్న మహిళ తన ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా తెలుసునని.. జయ-శోభన్‌బాబు కూతురిగా వస్తున్న రూమర్లన్నీ అవాస్తవాలనీ క్లారిటీ ఇచ్చింది. నెటిజన్లందరూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఆమెపై చక్కర్లు కొడుతున్న రూమర్‌ని తుడిచిపారేయండంటూ వేడుకుంది. మొత్తానికి.. ఆ మహిళ జయ్-శోభన్ జంటకు పుట్టిన అమ్మాయి కాదని క్లారిటీ వచ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news